Share News

Puvvada: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-10-31T12:44:04+05:30 IST

కాంగ్రెస్‌ అభ్యర్థి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నరంలేని నాలుకతో మాట్లాడుతూ నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు

Puvvada: నాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. నేను చేసిన అభివృద్ధిని తాను చేసినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు

- ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మలపై మంత్రి పువ్వాడ విమర్శ

ఖమ్మం: కాంగ్రెస్‌ అభ్యర్థి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, నరంలేని నాలుకతో మాట్లాడుతూ నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారని రవాణాశాఖ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌(Puvwada Ajay Kumar) విమర్శించారు. ప్రముఖ వైద్యుడు గంగరాజు ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్‌ అభ్యర్థి తనపై చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తుమ్మలనుద్దేశించి అన్నారు. తాను అభివృద్ధి చేయటం వల్లే సూపర్‌ స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు ఖమ్మం వచ్చాయన్నారు. కొత్త కలెక్టరేట్‌ భవనం, ఐటీహబ్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, ధంసలాపురం ఆర్‌వోబీ, నూతన బస్టాండ్‌, గోళ్లపాడు ఛానెల్‌, శ్రీశ్రీ సర్కిల్‌నుంచి వీవీ పాలెం వరకు రహదారి నిర్మాణం తదితర పనులు వివిధ నిర్మాణరంగసంస్థలు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నాయని, కాంట్రాక్టుల విషయంలో తనకేం సంబంధమని ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా, తనపై బురద చల్లటమే ధ్యేయంగా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలకు తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పాలని పువ్వాడ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైద్యులు బాగం కిషన్‌రావు, చైతన్య, సీతారాం, నవీన్‌, అనూష, ఆలూరి వంశీ, తదితరులు పాల్గొన్నారు.

bbb.jpg

Updated Date - 2023-10-31T12:44:04+05:30 IST