BJP: బండి సంజయ్ అధ్వర్యంలో కీలక సమావేశం

ABN , First Publish Date - 2023-03-31T22:45:01+05:30 IST

తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అధ్వర్యంలో పధాదికారుల సమావేశం జరుగుతోంది.

BJP: బండి సంజయ్ అధ్వర్యంలో కీలక సమావేశం
Bandi Sanjay

హైదరాబాద్: భాగ్యనగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ(Telangana BJP) అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) అధ్వర్యంలో పధాదికారుల సమావేశం జరుగుతోంది. ఇంచార్జ్‌లు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అర్వింద్ మీనన్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల గరికపాటి, జితేందర్ రెడ్డి, వివేక్ తదితరులు హాజరయ్యారు. ప్రధానంగా మూడు అంశాలపై చర్చించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై అంశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళే అంశంపై చర్చించారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తీకరణపై బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమీక్ష చేశారు.

అంతకు ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) వర్చువల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బిజెపి జిల్లా కార్యాలయాలు ప్రారంభించారు. పార్టీ కార్యకలాపాలకు నాడీ కేంద్రంగా పనిచేస్తాయని నడ్డా చెప్పారు. సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయన్నారు. అదే సమయంలో కార్యకర్తలు, ప్రజల సంక్షేమం కోసం పని చేసేలా చేస్తాయని నడ్డా చెప్పారు.

Updated Date - 2023-03-31T22:45:05+05:30 IST