Manikrao Thackeray: ఈరోజే బీజేపీ మంత్రులను కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యమేంటి?

ABN , First Publish Date - 2023-06-23T15:28:08+05:30 IST

కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్ కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ థాక్రే స్పందించారు. ఈరోజు పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతోందని... మరోవైపు ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారన్నారు.

Manikrao Thackeray: ఈరోజే బీజేపీ మంత్రులను కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యమేంటి?

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్ (Minister KTR) కలవడంపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్‌రావ్ థాక్రే (Telangana Congress in-charge Mani Rao Thackeray) స్పందించారు. ఈరోజు పాట్నాలో విపక్షాల మీటింగ్ జరుగుతోందని... మరోవైపు ఢిల్లీలో బీజేపీతో (BJP) బీఆర్‌ఎస్‌ నేతలు (BJP Leaders) మంతనాలు జరుపుతున్నారన్నారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్‌ కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రమంత్రి అమిత్ షా(Union Minister Amit Shah), మరికొందరిని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ కలుస్తున్నారన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ కూటమిగా కట్టేందుకు ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. అయితే బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసే ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. ఎవరు దాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్ అధికారంలో ఉందని.. ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని మాణిక్‌రావ్ థాక్రే పేర్కొన్నారు.

Updated Date - 2023-06-23T15:28:08+05:30 IST