BRS: జనగామ బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు..

ABN , First Publish Date - 2023-08-19T14:19:46+05:30 IST

జనగామ: బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. జనగామలో పల్లాకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

BRS: జనగామ బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు..

జనగామ: బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. జనగామలో పల్లాకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అలాగే స్టేషన్ ఘన్‌పూర్‌లోనూ కడియం శ్రీహరికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. కడియంకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వద్దంటూ రాజయ్య వర్గం నినాదాలు చేస్తున్నారు.

బీఆర్ఎస్‌లో టిక్కెట్లు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందికి చెక్ పెడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరగడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్ వస్తున్నట్లు ప్రచారం జరగడంతో ముత్తిరెడ్డి మద్దతు దారులు పెద్ద ఎత్తున జనగామ చౌరస్తాలో నిరసనలు చేపట్టారు.

మరోవైపు స్టేషన్ ఘన్‌పూర్‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య ఉండగా అక్కడ కడియం శ్రీహరికి టిక్కెట్ ఇస్తున్నట్లు ప్రచారం జరగడంతో రాజయ్య మద్దుతుదారులు నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు.

Updated Date - 2023-08-19T14:19:46+05:30 IST