TS News: మహబూబాబాద్‌లో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తం

ABN , First Publish Date - 2023-07-03T11:25:54+05:30 IST

మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలోని గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది.

TS News: మహబూబాబాద్‌లో గుడిసెల తొలగింపు.. ఉద్రిక్తం

మహబూబాబాద్: మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలోని గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సర్వే నెంబర్ 255/1 లో ఆరు ఎకరాల భూమిలో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను సోమవారం ఉదయం రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తొలగించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య గుడిసెలను తొలగించారు. దీంతో వీరిని నిరుపేద మహిళలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాసేపటికే గుడిసెవాసులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అనంతరం గుడిసెల వైపు వెళ్ళకుండా అడ్డుకున్నారు. తోపులాటలో పలువురు మహిళలు కిందపడిపోయారు. ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అధికారులు గుడిసెలను కూల్చివేయడం ఇది ఆరోసారిగా తెలుస్తోంది.

Updated Date - 2023-07-03T11:45:51+05:30 IST