TS News: న్యాయవాది ఇంటిపై దాడి ఘటనలో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2023-07-12T09:41:05+05:30 IST

హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఇటీవల న్యాయవాది ఏపూరి రవీందర్ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

TS News: న్యాయవాది ఇంటిపై దాడి ఘటనలో సంచలన విషయాలు

మహబూబాబాద్: హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఇటీవల న్యాయవాది ఏపూరి రవీందర్ రెడ్డి ఇంటిపై పోలీసుల దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది ఇంట్లో ఉన్న ఏపూరి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి... తనను హత్య చేసేందుకు నలభై లక్షల రూపాయలతో ఒప్పందం చేసుకున్నాడని ఏపూరి రవీందర్ రెడ్డి ఆరోపించారు. తనను హత్యచేసేందుకు వేసిన పన్నాగం ముందే తెలిసిపోవడంతో పోలీసులను ఆశ్రయించానని బాధితులు తెలిపాడు. ఆ కేసు విచారణలో భాగంగానే పోలీసులు సుభాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లినట్టు సమాచారం. ఇప్పటికైనా పోలీసులు తనకు భద్రత కల్పించాలని రవీందర్ రెడ్డి కోరుతున్నారు.

Updated Date - 2023-07-12T09:41:05+05:30 IST