TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో దారుణం .. బత్తాయి పండులో విషం ఇచ్చి చంపిన తండ్రి

ABN , First Publish Date - 2023-08-04T00:58:04+05:30 IST

జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే అభం శుభం తెలియని పసి మొగ్గల ప్రాణాలను చిదిమేశాడు.

TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో  దారుణం .. బత్తాయి పండులో  విషం ఇచ్చి చంపిన తండ్రి

మహబూబాబాద్(Mahabubabad): జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే అభం శుభం తెలియని పసి మొగ్గల ప్రాణాలను చిదిమేశాడు. ఈ సంఘటన మహబూబాబాద్ మండలం ఆమనగల్లు శివారుబలరాంతండాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం ఆమనగల్లు శివారుబలరాంతండాలో ఓ కుటుంబం ఉంటుంది. కాగా గత కొంతకాలంగా భార్య-భర్తల మధ్య వివాదం నడుస్తోంది. కొన్నొరోజుల క్రితం భార్య-భర్తల మధ్య ఘర్షణ పెద్దదె భర్త మీద అలిగి భార్య శాంతి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య మీద కోపం పెంచుకున్న ముక్కపచ్చలారనిఇద్దరు పిల్లలకు విషం (ఎలుకల మందు) బత్తాయి పండులో విషం ఇచ్చారు. స్థానికులు ఇద్దరు పిల్లలను మహబూబాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.చికిత్స పొందుతూ రాజ్ కుమార్(4)సంవత్సరాల బాబు మృతిచెందాడు. పెద్ద కుమారుడు విగ్నేష్(8) చికిత్స పొందుతున్నాడు. తండ్రి రమేష్ పరారీ ఉన్నట్లు సమాచారం. పోలీసులకు స్థానికులు సమాచాం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తండ్రి రమేశ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-08-04T00:58:16+05:30 IST