TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2023-10-02T21:39:32+05:30 IST

జిల్లాలో విషాదం నెలకొంది. డోర్నకల్‌లో ఓ వ్యక్తిపై హిజ్రాలు దాడి చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా రాధికను డోర్నకల్ మండలం అమ్మ పాలెంకు చెందిన గాదే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం.

TS NEWS: మహబూబాబాద్ జిల్లాలో విషాదం.. హిజ్రాల దాడిలో ఓ వ్యక్తి మృతి

మహబూబాబాద్: జిల్లాలో విషాదం నెలకొంది. డోర్నకల్‌లో ఓ వ్యక్తిపై హిజ్రాలు దాడి చేశారు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. హిజ్రా రాధికను డోర్నకల్ మండలం అమ్మ పాలెంకు చెందిన గాదే నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. నవీన్‌తో ఘర్షణ పడి హిజ్రాలు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నవీన్‌ను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తలింపుచారు. నవీన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు దగ్గరిలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2023-10-02T21:39:32+05:30 IST