Share News

IPS Officers : ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

ABN , Publish Date - Aug 16 , 2024 | 08:11 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేసిన కూటమి సర్కార్.. తాజాగా మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.

IPS Officers : ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Govt) మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. జులై-13న ఒకేసారి 37 మందిని ఐపీఎస్‌లను వివిధ జిల్లాలకు, విభాగాలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నెల వ్యధిలోనే ఇప్పుడు మరో 10 మంది అధికారులను బదిలీ చేసింది కూటమి సర్కార్. ఈ మేరకు శుక్రవారం రాత్రి అధికారికంగా ఉత్తర్వులను జారీ చేసింది. పాలనలో ప్రక్షాళన తీసుకురావడానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( CM Nara Chandrababu Naidu) ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు, ప్రమోషన్లు చేస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.


IPS-Transfers-In-AP.jpg

బదిలీలు ఇలా..

  • ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీలు

  • గ్రేహౌండ్స్‌ కమాండర్‌గా సుమిత్‌ సునీల్‌

  • అనంతపురం ఎస్పీగా జగదీశ్‌

  • సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కి అటాచ్‌

  • 16వ బెటాలియన్‌ కమాండెంట్‌గా మురళికృష్ణ

  • గుంతకల్లు రైల్వే ఎస్‌ఆర్‌పీగా రాహుల్‌ మీనా

  • విజయవాడ డీసీపీగా మహేశ్వర్‌ రాజ్‌

  • ఇంటెలిజెన్స్‌ ఎస్పీగా నచికేత్‌ విశ్వనాథ్‌

  • చింతూరు ఏఎస్పీగా పంకజ్‌ కుమార్‌ మీనా

  • గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండర్‌గా సునీల్‌ షరాన్‌

  • పార్వతీపురం SDPOగా అంకిత మహవీర్‌‌ను చంద్రబాబు సర్కార్ బదిలీ చేయడం జరిగింది.


IPS-Officers-1.jpgIPS-Officers-2.jpg

Updated Date - Aug 16 , 2024 | 08:28 PM