Share News

Bhuvaneshwari: పుట్టిపర్తిలో కొనసాగుతున్న ‘నిజం గెలవాలి’ యాత్ర

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:09 PM

Andhrapradesh: పుట్టిపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది.

Bhuvaneshwari: పుట్టిపర్తిలో కొనసాగుతున్న ‘నిజం గెలవాలి’ యాత్ర

పుట్టపర్తి, ఫిబ్రవరి 13: పుట్టిపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘‘నిజం గెలవాలి’’ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళ దేవర చెరువు మండలం గాజుకుంటపల్లి గ్రామంలో కార్యకర్త మేకల రామచంద్రరావు కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో 10-09-2023న రామచంద్రరావు మృతిచెందాడు. దీంతో రామచంద్రరావు చిత్రపటానికి భువనేశ్వరి నివాళులు అర్పించి.. వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అండగా ఉంటుందంటూ రామచంద్రరావు కుటుంబానికి భరోసా ఇచ్చారు. రామచంద్రరావు కుటుంబ సభ్యులకు రూ.3లక్షల చెక్కు ఇచ్చి భువనేశ్వరి ఆర్థికసాయం అందజేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 13 , 2024 | 05:09 PM