Share News

JATARA : భక్తిశ్రద్ధలతో దుగ్గిలమ్మ జాతర

ABN , Publish Date - Sep 04 , 2024 | 12:12 AM

పట్టణంలోని మధు థియేటర్‌ వెనుక నున్న ఆలయంలో దుగ్గిలమ్మ దేవత జాతరను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పా లంకరణ, వెండి కవచధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి వేపాకు, చీర, ముడుపులు చెల్లించారు. అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వ హించారు.

JATARA : భక్తిశ్రద్ధలతో దుగ్గిలమ్మ జాతర
Duggilamma in decoration

రాయదుర్గంరూరల్‌, సెప్టెంబరు 3: పట్టణంలోని మధు థియేటర్‌ వెనుక నున్న ఆలయంలో దుగ్గిలమ్మ దేవత జాతరను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. అమ్మవారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, పుష్పా లంకరణ, వెండి కవచధారణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి వేపాకు, చీర, ముడుపులు చెల్లించారు. అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వ హించారు. ప్రతి ఏడాది శ్రావణమాసం ముగిసిన మొదటి మంగళవారం జాతర నిర్వహిస్తారు. పట్టణ, గ్రామ ప్రాంతాల నుంచి వేలాదిమందిగా భక్తులు తరలివ చ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 04 , 2024 | 12:13 AM