Share News

CONGRESS: వైఎ్‌సఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం

ABN , Publish Date - Sep 02 , 2024 | 11:57 PM

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. సోమవారం వైఎ్‌సఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు.

CONGRESS: వైఎ్‌సఆర్‌ ఆశయాలను కొనసాగిద్దాం
Congress leaders paying tribute at YSR portrait

అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 2: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎ్‌సరాజశేఖర్‌రెడ్డి ఆశయాలను కొనసాగిద్దామని పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పేర్కొన్నారు. సోమవారం వైఎ్‌సఆర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి శైలజానాథ్‌ హాజరయ్యారు. వైఎ్‌సఆర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులు వాసు, జానవెస్లీ, శివశంకర్‌ యాదవ్‌, పరమేశ్వరరెడ్డి, శర్మా్‌సవలి, శ్రీకాంత, నిశాంతరెడ్డి, మూర్తి, మల్లికార్జున, అంజి, ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

ఇడుపులపాయలో... కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ సమాధి వద్ద జిల్లా నాయకులు ఘన నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తో పాటు జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్‌పరెడ్డి పలువురు నాయకులు వైఎ్‌సఆర్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు వేసి నివాళి అర్పించారు. అనంతరం శైలజానాథ్‌ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను కలిసి జిల్లాలోని పలు విషయాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.

Updated Date - Sep 02 , 2024 | 11:57 PM