Share News

MINISTER SAVITA : బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన మంత్రి సవిత

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:29 AM

నగరంలోని అరవింద నగర్‌లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పేద పిల్ల లు చదువుకునే వసతి గృహాల్లో భోజనం, ఇతర సదుపాయలు సక్రమంగా ఉండేలా చూడాలని స్బిబ్బందిని ఆదేశించారు.

MINISTER SAVITA : బీసీ హాస్టల్‌ను తనిఖీ చేసిన మంత్రి సవిత
Minister Savitha and MLA Daggupati talking to the students

అనంతపురం అర్బన, సెప్టెంబరు 22: నగరంలోని అరవింద నగర్‌లో ఉన్న బీసీ బాలికల వసతి గృహాన్ని ఆదివారం రాత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. పేద పిల్ల లు చదువుకునే వసతి గృహాల్లో భోజనం, ఇతర సదుపాయలు సక్రమంగా ఉండేలా చూడాలని స్బిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా తప్పిదాలు జరిగితే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన కెమెరామన శేఖర్‌ కుటుంబ సభ్యులను మంత్రి సవిత ఆదివారం పరామర్శించారు. నగరంలోని శేఖర్‌ ఇంటికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌తో కలిసి వెళ్లారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. శేఖర్‌ భార్యకు మంత్రి సవిత రూ.లక్ష చెక్కును అందించారు. మృతుని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరగా ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2024 | 12:29 AM