Share News

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

ABN , Publish Date - Feb 14 , 2024 | 09:17 AM

‘నిజం గెలవాలి’ కార్యక్రమం నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు కదిరి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి నారా భువనేశ్వరి పర్యటనకు బయలుదేరనున్నారు. పలువరురి కుటుంబాలను పరామర్శించనున్నారు.

AP News: నిజం గెలవాలి పర్యటన నేడు ఏ నియోజకవర్గాల్లోనంటే..

అనంతపురం: ‘నిజం గెలవాలి’ కార్యక్రమం నేడు ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ నియోజకవర్గాల్లో జరగనుంది. ఉదయం 10 గంటలకు కదిరి నియోజకవర్గంలోని బస ప్రాంతం నుంచి నారా భువనేశ్వరి పర్యటనకు బయలుదేరనున్నారు. పలువరురి కుటుంబాలను పరామర్శించనున్నారు. నేటి రాత్రి 8:25 గంటలకు తిరిగి భువనేశ్వరి బస ప్రాంతానికి చేరుకోనున్నారు.

10:00 – కదిరి నియోజకవర్గంలోని రాత్రి బస ప్రాంతం నుండి భువనేశ్వరి పర్యటనకు బయలుదేరతారు.

11:40 – ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

12:05 – ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలం, సంజీవపురం గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

01:00 – ధర్మవరం నియోజకవర్గం, రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో చేనేత మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి.

04:00 – రాప్తాడు నియోజకవర్గం, కనగానపల్లి మండలం, వేపకుంటలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

05:55 – రాప్తాడు నియోజకవర్గం, రామ్ గిరి మండలం, పోలెపల్లి గ్రామంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

07:30 – పెనుకొండ నియోజకవర్గం, దర్గా ప్రాంతంలో కార్యకర్త కుటుంబానికి పరామర్శ.

08:25 – రాత్రి బస ప్రాంతానికి భువనేశ్వరి చేరుకుంటారు.

Updated Date - Feb 14 , 2024 | 09:17 AM