Share News

CRICKET : ముమ్మర సాధన

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:30 AM

దులీప్‌ ట్రోఫీ మూడో రౌండ్‌ క్రికెట్‌ పోటీలు గురువారం నుంచి అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు దులీప్‌ ట్రోఫీ ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పా ట్లు చేస్తోంది. ఏసీజీలో ఇండియా ఏ, బీ, సీ, డీ జట్ల ప్లేయర్లు మంగళవా రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఉద యం ఇండియా-సి, ఇండియా-బి, మధ్యాహ్నం ఇండియా-ఎ, ఇండియా-డి జట్ల ఆటగాళ్లు సాధన చేశారు.

CRICKET : ముమ్మర సాధన
Players doing net practice

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 17: దులీప్‌ ట్రోఫీ మూడో రౌండ్‌ క్రికెట్‌ పోటీలు గురువారం నుంచి అనంతపురం క్రికెట్‌ గ్రౌండ్‌లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు దులీప్‌ ట్రోఫీ ఆర్గనైజింగ్‌ కమిటీ ఏర్పా ట్లు చేస్తోంది. ఏసీజీలో ఇండియా ఏ, బీ, సీ, డీ జట్ల ప్లేయర్లు మంగళవా రం ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఉద యం ఇండియా-సి, ఇండియా-బి, మధ్యాహ్నం ఇండియా-ఎ, ఇండియా-డి జట్ల ఆటగాళ్లు సాధన చేశారు. ఏసీజీ -ఏ గ్రౌండ్‌లో గురువారం ఇండి యా-ఎ, ఇండియా-సి జట్ల మధ్య... ఏసీజీ - బి స్టేడియంలో ఇండియా-బి, ఇండియా-డి జట్ల మధ్య మ్యాచలు జరగనున్నాయి. పాసుల పంపిణీ, ఇతర అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ దులీప్‌ ట్రోఫీ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు నిర్వహణపై వివరాలు ప్రకటించకపోవడం గమనార్హం. క్రికెట్‌ అభిమానులు నిర్వహ కుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నాలుగు జట్ల క్రీడా కారుల వివరాలు బీసీసీఐ ప్రకటించాల్సి ఉంది.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:30 AM