Share News

MP BK : రతనటాటా మృతి దేశానికి తీరనిలోటు

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:49 PM

ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌, టాటాగ్రూప్స్‌ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు.

MP BK : రతనటాటా మృతి దేశానికి తీరనిలోటు
BK and leaders paying their respects at Ratanatata's portrait

పెనుకొండ, అక్టోబరు 10: ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్‌, టాటాగ్రూప్స్‌ చైర్మన రతనటాటా మృతి భారతదేశానికి తీరనిలోటని ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళి అర్పించారు. టాటాఅంటే భారతదేశ ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారన్నారు. ఆయన పారిశ్రామికవేత్తగా కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజానికి సేలందించారన్నారు. కొవిడ్‌ సమయంలో 1500 కోట్లు విరాళం ఇచ్చిన మహనీయుడన్నారు. నాయకులు జీవీపీ నాయుడు, సుబ్బరాయుడు, రవిశంకర్‌, అనీల్‌కుమార్‌, నాని, చంద్రమౌళి, గాయిత్రి పాల్గొన్నారు.

Updated Date - Oct 10 , 2024 | 11:49 PM