Share News

HOMAM : వెంకటేశ్వరాలయంలో సుదర్శన హోమం

ABN , Publish Date - Sep 29 , 2024 | 12:47 AM

చిత్తశుద్ది లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడంతోనే కల్తీ లడ్డూ ఘటనలతో అపవి త్రాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవనకళ్యాణ్‌ శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మ ద్ధతుగా టీసీ వరుణ్‌ ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్‌, రాయలసీమ ప్రాంతీయ మహిళ కన్వీనర్‌ పెండ్యాల శ్రీలత, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావుతో కలిసి శ్రీనివాస నగర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహిం చారు.

HOMAM : వెంకటేశ్వరాలయంలో సుదర్శన హోమం
TC Varun and Janasena leaders conducting the homam

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, సెప్టెంబరు28 : చిత్తశుద్ది లేని వారిని టీటీడీ బోర్డు చైర్మన్లుగా నియమించడంతోనే కల్తీ లడ్డూ ఘటనలతో అపవి త్రాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ మండిపడ్డారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, జనసేన అదినేత పవనకళ్యాణ్‌ శ్రీవారి లడ్డూ కల్తీ జరిగిందన్న నేపథ్యంలో చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మ ద్ధతుగా టీసీ వరుణ్‌ ఆ పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్‌, రాయలసీమ ప్రాంతీయ మహిళ కన్వీనర్‌ పెండ్యాల శ్రీలత, నగర అధ్యక్షుడు పొదిలి బాబురావుతో కలిసి శ్రీనివాస నగర్‌లోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో సుదర్శన హోమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పార్టీ ఆదేశాల మేరకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్‌ సెల్‌ జిల్లా అద్యక్షులు మురళీకృష్ణ, జిల్లా ప్రధానకార్యదర్శిలు పత్తి చంద్రశేఖర్‌, కుమ్మర నాగేంద్ర, నాయకులు కిరణ్‌కుమార్‌, ముప్పూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 29 , 2024 | 12:47 AM