Share News

JC: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి.. లేదంటే

ABN , Publish Date - Jan 10 , 2024 | 03:24 PM

Andhrapradesh: మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు చెప్పామన్నారు.

JC: ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలి.. లేదంటే

అనంతపురం, జనవరి 10: మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు అనేక సార్లు చెప్పామన్నారు. వచ్చే సోమవారంలోపు ఆవిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎవరెవరో విగ్రహాలను పెట్టారని.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం మాత్రం ఏర్పాటు చేయడం లేదని మండిపడ్డారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుపై రాజకీయాలు చేస్తే వేరే వాళ్ళ విగ్రహాలు పీకేస్తామని హెచ్చరించారు. చిరంజీవి పుణ్యాన.. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఎవరో ప్రజలకు తెలిసిందన్నారు. సోమవారంలోపు విగ్రహాన్ని ఆవిష్కరించాలని... లేదంటే తానే విగ్రహం ఆవిష్కరిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 10 , 2024 | 03:24 PM