Share News

COLLECTOR : డ్రిప్‌ మంజూరులో ప్రథమ స్థానంలో నిలవాలి

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:24 AM

డ్రిప్‌ పరికరాల మంజూరులో జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులు, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులకు ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో ఏపీఎంఐపీ అధికారులు, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాకు 37500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింకర్ల మం జూరు కోసం ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు.

COLLECTOR : డ్రిప్‌ మంజూరులో ప్రథమ స్థానంలో నిలవాలి
Collector Vinod Kumar speaking in the review

అధికారులకు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచన

అనంతపురం అర్బన, సెప్టెంబరు 17 : డ్రిప్‌ పరికరాల మంజూరులో జిల్లా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సంబంధిత అధికారులు, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులకు ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్‌లో ఏపీఎంఐపీ అధికారులు, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాకు 37500 హెక్టార్లల్లో డ్రిప్‌, స్ర్పింకర్ల మం జూరు కోసం ప్రభుత్వం లక్ష్యం విధించిందన్నారు. ఇప్పటి దాకా 33,331 మంది రైతులు 48099 హెక్టార్లకు డ్రిప్‌ మంజూరు కోసం రైతు సేవా కేం ద్రాల్లో నమోదు చేసుకున్నారన్నారు. డ్రిప్‌, స్ర్పింక్లర్ల సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న 28 కంపెనీలు నిర్దేశించిన మేరకు లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.


అర్హులైన రైతులకు డ్రిప్‌, స్ర్పింక్లర్లు మంజూరు చేసేలా వ్యవసాయ, ఉద్యాన, సెరికల్చర్‌ అధికారులు చొరవ చూపాలన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ కార్యక్రమంలో భాగంగా ఏపీఎంఐపీకి సంబంధించి వదల రోజుల యాక్షన ప్లానలోని 7200 హెక్టార్లల్లో డ్రిప్‌ మం జూరు ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య క్రమంలో ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి ఉమా మహేశ్వరమ్మ, జిల్లా ఉద్యానాధికారి నరసింహారావు, ఏపీఎంఐపీ ఏపీడీ ఫి రోజ్‌ ఖాన, పలువురు అధికారులు, డ్రిప్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 18 , 2024 | 12:24 AM