Share News

VEERA SHAIVA : వీరశైవ లింగాయతులను ఓబిసీ జాబితాలో చేర్చాలి

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:24 AM

రాష్ట్రంలోని వీర శైవ లింగాయతులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని టీడీపీ వీరశైవ లింగాయత సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ సాంబశివుడు కోరారు. ఆ మేరకు మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓబీసీ సమీక్షా సమావేశంలో జాతీయ ఓబీసీ కమిటీ చైర్‌పర్సన గణేష్‌ సింగ్‌కు జాతీయ ఓబీసీ కమిటీ సభ్యుడు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.

VEERA SHAIVA : వీరశైవ లింగాయతులను ఓబిసీ జాబితాలో చేర్చాలి
Leaders presenting a petition to the Chairperson of the National OBC Committee

అనంతపురం రూరల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వీర శైవ లింగాయతులను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని టీడీపీ వీరశైవ లింగాయత సాధికార సమితి రాష్ట్ర డైరెక్టర్‌ సాంబశివుడు కోరారు. ఆ మేరకు మంగళవారం హైదరాబాదులో జరిగిన ఓబీసీ సమీక్షా సమావేశంలో జాతీయ ఓబీసీ కమిటీ చైర్‌పర్సన గణేష్‌ సింగ్‌కు జాతీయ ఓబీసీ కమిటీ సభ్యుడు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా 2009 నుంచి వీరశైవులకు కేంద్ర సర్వీసెస్‌లో, కేంద్ర విద్యా ఉద్యోగ అవకాశాలలో జరుగుతున్న నష్టాన్ని వారికి వివరించినట్లు సాంబశివుడు తెలిపారు. తమకు న్యాయం చేయాలని..ఆ మేరకు ఆంధ్రప్రదేశ ప్రభుత్వ అసెంబ్లీలో తీర్మానం కోసం చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వీర శైవ సమాజం రాష్ట్ర సభ్యుడు బసవరాజు, వీరశైవ ఎంప్లాయీస్‌ యూనియన కోశాధికారి జిల్లా శివకుమార్‌ పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Oct 23 , 2024 | 12:24 AM