Share News

MLA MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:47 PM

మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్‌సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు.

MLA  MS RAJU:మడకశిర డిపోను అభివృద్ధి చేస్తాం
MLA MS Raju inaugurating the new bus

మడకశిరటౌన, అక్టోబరు 10: మడకశిర డిపోను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. మడకశిర డిపో నుంచి ఉదయం 5 గంటలకు వెళ్లే కర్నూలు సర్వీ్‌సకు కొత్త బస్సును టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ఎమ్మెల్యే అమరాపురం బస్టాండులో జెండా ఊపి గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. డిపో మేనేజర్‌ రామసుబ్బయ్య, మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, నాయకులు నాగరాజు, మంజునాథ్‌, సురేష్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన ఆర్డీఓ: పెనుకొండ ఆర్డీఓగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆనందకుమార్‌ గురువారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఎమ్మెల్యే ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామిలను మర్యాద పూర్వకంగా కలిశారు. గతంలో ఆనందకుమార్‌ మడకశిర తహసీల్దార్‌గా విధులు నిర్వహించారు. ఎమ్మెల్యే ఆర్డీఓకు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, నియోజకవర్గంలో భూములకు సంబంధించి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Updated Date - Oct 10 , 2024 | 11:47 PM