Share News

GUNDUMALA: చంద్రన్నతోనే పేదలకు సంక్షేమం

ABN , Publish Date - Oct 17 , 2024 | 11:46 PM

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు.

GUNDUMALA: చంద్రన్నతోనే పేదలకు సంక్షేమం
Thippeswamy is inviting the party to join the TDP by wearing a party scarf

మడకశిర టౌన, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి అన్నారు. గురువారం బాలాజీనగర్‌లోని టీడీపీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 60 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీకి చెందిన ఎస్‌.ఎ.రాజేష్‌, రాజేంద్ర, రాము, జయరామప్ప, నాగరాజు, అశోక్‌, అరుణ, లావణ్య, గిరిజ, లక్ష్మీదేవమ్మ, అశ్వత్థమ్మతోపాటు 60 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. వారందరికీ తిప్పేస్వామి కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారు మాట్లాడుతూ పేదల సంక్షేమం ఒక్క చంద్రబాబుతోనే సాధ్యమని, విశ్వసించి పార్టీలోకి చేరుతున్నట్లు తెలిపారు. కౌన్సిలర్‌ ఉమాశంకర్‌, తిమ్మరాజు, రఘురాం ఉన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 11:46 PM