Share News

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:18 AM

విజయవాడ వరద బాదితులకు అండగా హిందూపురం పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు తమవంతు సాయం అందజేశారు. వారు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.5లక్షలు చెక్కును అందజేశారు. ఈ చెక్కును టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, కౌన్సిలర్‌ డీఈ రమేష్‌కు అందించారు.

HELP VICTIMS : వరద బాధితులకు మహిళల సాయం
TDP leaders handing over checks to Mahila Samakhya leaders

హిందూపురం, సెప్టెంబరు 9 : విజయవాడ వరద బాదితులకు అండగా హిందూపురం పట్టణ మహిళా సమాఖ్య సభ్యులు తమవంతు సాయం అందజేశారు. వారు సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1.5లక్షలు చెక్కును అందజేశారు. ఈ చెక్కును టీడీజీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, మునిసిపల్‌ వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, కౌన్సిలర్‌ డీఈ రమేష్‌కు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు మా ట్లాడుతూ... ఆపదలో ఉన్న వరద బాధితులకు పట్టణ మహిళా సమాఖ్య తమవంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ వరద బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం, విరాళాలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి పరిమళ, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి, పట్టణ సమా ఖ్య అధ్యక్షురాలు మల్లికాబాను, కవిత, కొట్నూరు నాగభూషణం, కింగ్‌ షఫీ, దాదు, కిరోసిన బాబు, వెంకటేశ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Sep 10 , 2024 | 12:18 AM