Share News

Chandrababu: చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్‌పై వేటు

ABN , Publish Date - Jul 02 , 2024 | 11:40 AM

శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ ని సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈయన గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. అప్పట్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి డబ్బులు లంచం అడిగిన చరిత్ర ఈయనది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు.

Chandrababu: చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్‌పై వేటు

చిత్తూరు: జిల్లాలోని శాంతిపురం డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్‌ను సస్పెండ్ అయ్యారు. జాయింట్ కలెక్టర్ ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈయన గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది. టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి.. గత వైసీపీ హయాంలో డబ్బులు లంచం అడిగిన చరిత్ర ఈయనది. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆయనకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా.. ఊరుకోలేదు. పాపం పండింది.. సస్పెన్షన్ వేటు పడింది.


రైతు నుంచి భూ సర్వే కోసం లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేశారని ఫిర్యాదు రావడంతో విచారించి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. గతంలో చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణంలో కూడా డిప్యూటీ సర్వేయర్ సద్దాం ఉస్సేన్ ఇబ్బందులు పెట్టారు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండటంతో విచ్చలవిడిగా రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సీఎం సొంత నియోజకవర్గంలో సమూలంగా ప్రక్షాళన చేయాలనీ అవినీతి అధికారులపై చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీతో అంటకాగిన పోలీసులను అధికారులు వీఆర్‌కి పంపారు. ఈ ఘటనతో రెవెన్యూ అధికారుల్లోనూ గుబులు మొదలైంది.

Updated Date - Jul 02 , 2024 | 01:03 PM