Share News

AP News: నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు

ABN , Publish Date - Mar 02 , 2024 | 08:25 AM

నెల్లూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్‌లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరనున్నారు.

AP News: నేడు నెల్లూరులో పర్యటించనున్న చంద్రబాబు

నెల్లూరు: నెల్లూరులో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటించనున్నారు. వీపీఆర్ కన్వెన్షన్‌ (VPR Convention)లో భారీ సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి నారాయణ, ఎంపీ వీపీఆర్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy)ఏర్పాట్లని పరిశీలించారు. చంద్రబాబు సమక్షంలో వీపీఆర్ దంపతులు, వేల సంఖ్యలో వైసీపీ నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీడీపీ (TDP)లో చేరనున్నారు.

నిన్న మొన్నటి వరకూ వైసీపీ కార్యక్రమాలు అన్నింటికీ వీపీఆర్ కన్వెన్షన్ వేదికగా ఉంది. నేడు అది పసుపుమయంగా మారింది. వీపీఆర్ కన్వెన్షన్‌లో మొట్టమొదటి సారిగా ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statue) ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయం 11.50 గంటలకి చంద్రబాబు నెల్లూరుకి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1.30 వరకు సమావేశంలో పాల్గొననున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.


Updated Date - Mar 02 , 2024 | 08:25 AM