Share News

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:49 PM

గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులపై చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ వరసగా బదిలీ వేటు వేస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఈ బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కలెక్టర్ మాధవీలత (Collectors Madhavilatha), గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి (Collectors Venugopal Reddy)పై బుధవారం రోజున బదిలీ వేటు పడింది.

AP Govt: జీఏడీలో రిపోర్టు చేసిన కలెక్టర్లు మాధవీలత, వేణుగోపాల్ రెడ్డి..

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగారన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు అధికారులపై చంద్రబాబు(CM Chandrababu) సర్కార్ వరసగా బదిలీ వేటు వేస్తోంది. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఈ బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా(East Godavari) కలెక్టర్ మాధవీలత (Collectors Madhavilatha), గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి(Collectors Venugopal Reddy)పై బుధవారం రోజున బదిలీ వేటు పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ (గురువారం) కలెక్టర్లు జీఏడీలో రిపోర్టు చేశారు.


జగన్ సర్కార్‌తో అంటకాగిన పలువురు ఐఏఎస్‌లను శనివారం రోజున చంద్రబాబు సర్కార్ భారీగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అధికార యంత్రాంగం ప్రక్షాళనలో భాగంగా బదిలీలు చేపట్టారు. ఇందులో అల్లూరి జిల్లా కలెక్టర్‌ ఎం.విజయసునీత, విశాఖ కలెక్టర్ మల్లికార్జున సహా పలువురు ఐఏఎస్‌లు ఉన్నారు. ఈనెల 20న సైతం ఐఏఎస్‌లు శ్రీలక్ష్మి, రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాశ్, మురళీధర్ రెడ్డికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టారు.

ఇది కూడా చదవండి:

AP Politics: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ పద్మశ్రీ, రాకేశ్ రెడ్డికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు..

Updated Date - Jun 26 , 2024 | 03:54 PM