Share News

కాకినాడ నుంచి అంతర్వేదికి టీడీపీ కార్యకర్తల పాదయాత్ర

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:00 AM

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా కొండబాబు అత్యఽధిక మెజారిటీతో గెలుపొందాలని లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్న 10వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి మూ గు రాజు, టీడీపీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి మూగు చిన్ని ఆధ్వర్యంలో

కాకినాడ నుంచి అంతర్వేదికి  టీడీపీ కార్యకర్తల పాదయాత్ర
పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని, ఎమ్మెల్యేగా కొండబాబు అత్యఽధిక మెజారిటీతో గెలుపొందాలని లక్ష్మీనరసింహ స్వామికి మొక్కుకున్న 10వ డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జి మూ గు రాజు, టీడీపీ కాకినాడ సిటీ అధికార ప్రతినిధి మూగు చిన్ని ఆధ్వర్యంలో కార్యకర్తలు బుధవారం దుమ్ములపేట దుర్గమ్మతల్లి గుడివద్ద నుంచి పాదయాత్రగా అంతర్వేది బయలుదేరివెళ్లారు. ఈ పాదయాత్రను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జెండా ఊపి ప్రారంభించి కొంతదూరం నడిచారు. పాదయాత్ర బృందానికి పండితు లు వేదమంత్రాలతో ఆశ్వీరాదాలు అందించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, మైనారిటీ నాయకుడు ఎంఏ తాజుద్దీన్‌, టీడీపీ నాయకులు తుమ్మల సునీత రమే ష్‌, చోడిపిల్లి సతీష్‌, మోసా పేతూరు, ఎరిపిల్లి అబ్బాయి, నూకరాజు, లక్ష్మణరావు, పోలరాజు, యాకూబు ఉన్నారు.

Updated Date - Sep 19 , 2024 | 12:00 AM