Share News

Nara Bhuvaneswari: తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి

ABN , Publish Date - Jan 24 , 2024 | 11:35 AM

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

Nara Bhuvaneswari: తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్న భువనేశ్వరి

రాజమండ్రి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుతో వేదనకు గురై కొంతమంది మరణించడంతో వారి కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి..’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు.

చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన సమయంలో వేదనకు గురై అశువులు బాసిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఆర్థిక సాయం అందించనున్నారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. చంద్రగిరి మండలంలోని నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్రను ఆమె ప్రారంభించారు.

నారా చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టిన కుప్పం నుంచి ప్రారంభిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు ఇదొక సెంటిమెంట్. దీన్నే టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అయ్యారు. యువగళం పాదయాత్రను ఇక్కడి నుంచే ఆరంభించారు. నారా భువనేశ్వరి కూడా కుప్పం నుంచే ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Updated Date - Jan 24 , 2024 | 12:16 PM