Share News

సాక్షి పేపర్లు దహనం

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:02 AM

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ముంబై నటి జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతో జగన్‌ రెడ్డి తన సొంత మీడియా సాక్షి పేపరులో మహిళలను కిం

సాక్షి పేపర్లు దహనం

కాకినాడ సిటీ, సెప్టెంబరు 18: ముంబై నటి జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతో జగన్‌ రెడ్డి తన సొంత మీడియా సాక్షి పేపరులో మహిళలను కించపరుస్తూ రాతలు రాయిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ మేయర్‌ సుంకర పావని ధ్వజమెత్తారు. ఆమె ఆధ్వర్యంలో జగన్‌రెడ్డి తీరును నిరసిస్తూ టీడీపీ మహిళా కార్యకర్తలు బుధవారం కాకినాడలో సాక్షి పేపర్లను మంట ల్లో వేసి దహనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లా డుతూ జత్వానీపై అక్రమ కేసులో తాడేపల్లి ప్యాలెస్‌లో స్ర్కిప్ట్‌ రాసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారం పోయాకైనా సరే ఆడవాళ్లను అవమానించడం జగన్‌రెడ్డి మానుకోవాలని సుంకర పావని హెచ్చరించారు.

Updated Date - Sep 19 , 2024 | 12:02 AM