Share News

NDA Kutami: సీఎం చంద్రబాబు రేపు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ..

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:16 AM

అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది.

NDA Kutami: సీఎం చంద్రబాబు రేపు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ..

అమరావతి: ఎన్డీయే కూటమి ప్రభుత్వం (NDA Kutami Govt.) 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కూటమి ఎమ్మెల్యేలతో (MLAs) ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరి లోనే సీకే కన్వెన్షన్ హాల్లో నాలుగు గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సుమారు మూడు గంటలకుపైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వందరోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప మూడు పార్టీల ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానించారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు సారథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలో డీజీపీ కార్యాలయం సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. వంద రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్‌ కార్డులు తయారుచేసి ఎవరికి వారికి విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత భావించారు. అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని... లేని పక్షంలో తర్వాత ఇవ్వనున్నారు. ఇంకోవైపు.. మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జులు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వారంతా మంగళవారం అమరావతిలో అందుబాటులో ఉండాలని కోరినట్లు సమాచారం.


కాగా సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయానికి వెళ్లనున్నారు. ఆయన జరపనున్న సమీక్షల్లో సంబంధిత శాఖ మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు జరపనున్న సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షకు మంత్రి ఎస్ సవిత, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చైనాను వణికిస్తున్న బెబింకా తుఫాను..

జానీ మాస్టర్ బాధితురాలి స్టేట్మెంట్‌లో సంచలన నిజాలు..

ఢిల్లీ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ..

రాజధాని నిర్మాణాలు సేఫ్‌

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Sep 17 , 2024 | 09:16 AM