Share News

kadambari Jethwani: జెత్వానీ కేసులో ఇద్దరిపై వేటు

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:33 AM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్‌ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్‌ చేస్తూ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు.

kadambari Jethwani: జెత్వానీ కేసులో ఇద్దరిపై వేటు
Kadambari Jatwani

  • ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ

  • మరో ఇద్దరు సీఐలు, ఎస్‌ఐ పాత్ర

  • త్వరలో వారిపైనా చర్యలు?

  • విద్యాసాగర్‌, పీఎ్‌సఆర్‌, కాంతిరాణా

  • విశాల్‌గున్నీపై కాదంబరి మరోసారి ఫిర్యాదు

విజయవాడ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు వేశారు. నాడు కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్‌ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్‌ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్‌ చేస్తూ డీజీపీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆయన ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. నెల రోజులుగా కాదంబరి జెత్వానీ వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి విజయవాడకు వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్రకుమార్‌ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.


విచారణ చేయడానికి ప్రత్యేకాధికారిగా క్రైమ్స్‌ ఏసీపీ స్రవంతి రాయ్‌ను నియమించారు. రెండు రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు ఆమెకు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ డీజీ పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు ఆదేశాలతో నాటి విజయవాడ పోలీసు కమిషనర్‌ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీ ఇబ్రహీంపట్నం పోలీ్‌సస్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు చేయించారని కాదంబరి వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన అరెస్టు చేయడానికి విశాల్‌గున్నీ నేరుగా ముంబై వచ్చారని ఆరోపించారు.


పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌కు మేలు చేయడానికి తనపై అక్రమంగా తప్పుడు కేసు బనాయించారని విజయవాడలో పోలీసు అధికారులకు విన్నవించుకున్నారు. శుక్రవారం రాత్రి కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌, సహకరించిన ఐపీఎస్‌ అధికారులు పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వారిపై కేసు నమోదు చేయాలని ఆమె కుటుంబం పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేసింది. కొద్దిరోజుల క్రితం కాదంబరి మహిళా సంఘాలతో కలిసి సీపీని కలిశారు. తాజాగా తన న్యాయవాదులతో కాదంబరి, ఆమె తండ్రి నరేంద్రకుమార్‌, తల్లి ఆశా జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. కాదంబరి ఫిర్యాదు చేస్తుండగానే ఈ కేసుకు సంబంధించి అప్పటి పశ్చిమ జోన్‌ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణను సస్పెండ్‌ చేశారు. కాదంబరి వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం. త్వరలో వారి పైనా చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారిలో ఒక ఇన్‌స్పెక్టర్‌ విజయవాడలో, మరో ఇన్‌స్పెక్టర్‌ ఏలూరు రేంజ్‌లో, ఎస్‌ఐ కృష్ణా జిల్లాలో ఉన్నట్టు తెలుస్తోంది.


Also Read:

ఇంకా జగన్‌ జపమేనా

బంగారం, వెండి ధరలు భారీగా జంప్.. ఎంతకు చేరాయంటే

అందరికీ సాయం

For MoreAndhra Pradesh NewsandTelugu News..

Updated Date - Sep 14 , 2024 | 08:24 AM