Share News

Chandrababu Naidu: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. వేదికపై ఇంట్రెస్టింగ్ సీన్

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:33 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా (నవ్యాంధ్రకు రెండోసారి) నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద..

Chandrababu Naidu: చంద్రబాబు ప్రమాణస్వీకారం.. వేదికపై ఇంట్రెస్టింగ్ సీన్
Interesting Scene Between Chandrababu And PM Modi

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ముఖ్యమంత్రిగా (నవ్యాంధ్రకు రెండోసారి) నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఉదయం 11:27 గంటలకు ఆయన సీఎం‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు మరెందరో రాజకీయ, సినీ తారలు తరలి వచ్చారు. అటు.. సభా ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది.


ఆ సంగతులు అలా ఉంచితే.. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేదికపై ఓ ఆసక్తికరమైన సన్నివేశం వెలుగుచూసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. వేదికపై ఉన్న నరేంద్ర మోదీ ఆయనకు పూలగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాభివందనం చేయబోగా.. అందుకు మోదీ నిలువరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభా ప్రాంగణంలోని జనాలు ఈ దృశ్యం చూసి.. ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో.. ఆ కొన్ని క్షణాల పాటు ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. అనంతరం చంద్రబాబు వేదికపై ఉన్న ఇతర అతిథులను నమస్కరించారు. ఇదే సమయంలో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు.


ఇదే వేదికపై.. మెగాభిమానులను భావోద్వేగానికి గురి చేసే మరో అద్భుత ఘట్టం కూడా చోటు చేసుకుంది. తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అతిరథ మహారథులను నమస్కరించిన పవన్ కళ్యాణ్.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. అందుకు చిరంజీవి నిలువరించబోయినా.. పవన్ తన అన్నయ్య పాదాలను తాకి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని షేర్ చేస్తూ.. మెగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - Jun 12 , 2024 | 12:33 PM