Home » Narendra Modi
ముంబై ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడైన తహవూర్ రాణాని ఇండియాకు తీసుకువచ్చారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన దౌత్య విజయం అని ప్రశంసిస్తున్నారు. రాణాను ఇండియాకు తీసుకువచ్చిన నేపథ్యంలో మోదీ పాత ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ వివరాలు..
అమీనా మనీకా మినికాయ్ ద్వీపం నుంచి ఢిల్లీలోని మోదీతో భేటీ కావడానికి హెలికాప్టర్ సేవలు ఉపయోగించుకుంది. ముద్రా యోజన ద్వారా ఆమెకు ఆర్థిక సహాయం అందించి ఈ ఘనత సాధించడానికి సహాయపడింది
తమిళనాడుకు కేంద్రం కేటాయింపులపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేశాయి. గతంతో పోలిస్తే.. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే తమిళనాడుకు భారీగా నిధులు కేటాయించామన్న మోదీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత పీ చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ఆ వివరాలు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు గత పదేళ్లలో భారీగా నిధులిచ్చామని చెప్పారు. 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి మూడు రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు.
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ప్రధాని అధికారిక కార్యక్రమానికి సీఎం హాజరుకాకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
తమిళ భాషలో మెడికల్ కోర్సులు ప్రారంభించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని తాను కోరుతున్నాననీ, ఇందువల్ల పేద కుటుంబాల పిల్లలు సైతం వైద్యులు కావాలనే తమ కలలను పండించుకుంటారని మోదీ అన్నారు.
శ్రీలంక నుంచి తిరిగివస్తుండగా రామసేతు దర్శన భాగ్యం లభించిందని, ఇదే సమయంలో దైవిక యాదృచ్ఛికంగా అయోధ్యలో సూర్య కిరణాలు బాలరాముని నుదట తిలకం దిద్దాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
అభివృద్ధి భారతం (వికసిత్ భారత్)లో తమిళనాడు కీలక పాత్ర పోషిస్తోందని, పంబన్ రైల్వే వంతెనపై కొత్త రైలు సర్వీసుతో రామేశ్వరం, చెన్నై, దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానం పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.
పాంబన్ పాత వంతెన దెబ్బతినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి 2019 మార్చి 1న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి కోసం మొదట రూ. 250 కోట్లు కేటాయించింది. కానీ వంతెన పూర్తయ్యేనాటికి వ్యయం రూ. 535 కోట్లకు పెరిగింది.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పెను సవాళ్లను ఎదుర్కొంటోందని, ఉచిత రేషన్ అందుకుంటున్న వారి తలసరి ఆదాయం ఎంతో ఉందో తెలుసుకుంటే అది అర్థమవుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.