Share News

JD Lakshminarayana: విభజన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమైన జగన్

ABN , Publish Date - Mar 10 , 2024 | 10:17 PM

విభజన హామీలను సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని జగన్ అన్నారన్నారు.

JD Lakshminarayana: విభజన హామీలను సాధించడంలో ఘోరంగా విఫలమైన జగన్

విశాఖపట్నం: విభజన హామీలను సాధించడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ(JD Lakshminarayana) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 25 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదాను కేంద్రం మెడలు వంచి సాధిస్తామని జగన్ అన్నారన్నారు. 22 మంది వైసీపీ ఎంపీలు గెలిచినా ... ఏమీ సాధించలేకపోయారని చెప్పారు. ప్రధానికి విన్నపాలు చేయడం తప్ప.. రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటూ.. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోకుండా వ్యవహరించడం ఘోరమని చెప్పారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, విభజన హామీలను సాధించుకోవడంలో అధికార, ప్రతిపక్షాలు విఫలమయ్యాయని జేడీ లక్ష్మీనారాయణ మండిపడ్డారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 10:17 PM