Share News

AP NEWS: సచివాలయంలో నిరసనకు దిగిన కేఏపాల్.. ఎందుకంటే..?

ABN , Publish Date - Mar 07 , 2024 | 10:23 PM

ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు.

AP NEWS: సచివాలయంలో నిరసనకు దిగిన కేఏపాల్.. ఎందుకంటే..?
KA Paul

అమరావతి: ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) గురువారం నాడు నిరసనకు దిగారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసేందుకు సచివాలయానికి కేఏ పాల్ వచ్చారు. అనుమతి లేదంటూ సెక్రటేరియట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత లోపలికి అనుమతించలేదు. సీఈవో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉండడంతో ఇప్పుడు కలవలేరని సిబ్బంది చెప్పింది. ఐదో బ్లాక్ ఎంట్రన్స్ వద్ద మెట్లపై కూర్చుని కేఏ పాల్ నిరసనకు దిగారు. ఎన్నికల విషయమై సీఈఓను కలిసేటందుకు వచ్చానని పాల్ చెప్పారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 10:23 PM