Share News

ఘోర రోడ్డు ప్రమాదం

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:53 PM

బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

 ఘోర రోడ్డు ప్రమాదం
ప్రమాదంలో కాలిపోయిన సిమెంటు లారీ

సిమెంట్‌ లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం

సిమెంటు లారీ దగ్ధం... యువకుడు మృతి

బి.కొత్తకోట, సెప్టెంబరు 3: బి.కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా యర్రగుంట్ల నుంచి బయలుదేరిన సిమెంటు లారీ బి.కొత్తకోట శివారులోకి రాగానే ఎదురుగా ద్విచక్రవాహనంలో వచ్చిన ఓ యువకుడు నేరుగా లారీ ముందు భాగంలో ఢీకొన్నాడు. ద్విచక్రవాహనం లారీ ముందు ఇరుక్కుపోయింది. యువకుడితో సహా ద్విచక్రవాహనాన్ని సిమెంటు లారీ సుమారు 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ రాపిడికి ద్విచక్రవాహనంలోని పెట్రోల్‌ ట్యాంక్‌ నుంచి మంటలు అంటుకున్నాయి. అవే మంటలు లారీకి కూడా వ్యాపించడంతో లారీడ్రైవర్‌ కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. లారీ క్యాబిన్‌ మొత్తం కాలిపోయింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ఏరియా అసుపత్రికి తరలించారు. పోలీసుల విచారణలో మృతుడు పీలేరు బెస్తపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు బెస్త మహేశ్‌(25)గా గుర్తించారు. తాపీమేస్త్రీగా పీటీఎం మండలం సొన్నువారిపల్లెకు చెందిన ఓ మేస్త్రీ ఆధీనంలో పనిచేస్తున్నాడు. ఇతడికి స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఏర్పాటు చేశారు. బి.కొత్తకోట నుంచి ఇందిరమ్మ కాలనీకి వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు.

Updated Date - Sep 03 , 2024 | 10:53 PM