Share News

ఏఐఆర్‌ఎనడబ్ల్యుఎల్‌సీ పోటీలలో ప్రతిభ చాటిన శివరామకృష్ణ

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:00 AM

ముంబయి నగరంలో ఈనెల 26 నుంచి జరిగిన ఆల్‌ ఇండియా రైల్వే నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియనషి్‌ప (ఏఐఆర్‌ఎనడబ్ల్యుఎల్‌సీ) పోటీలలో కడప నగరం ఉక్కాయపల్లెకు చెందిన ఎ.శివరామకృష్ణయాదవ్‌ (గుంటూరు రైల్వే ఉద్యోగి-టీసీ) 89 కేజీల విభాగంలో పాల్గొని రజత పతకం సాధించారు.

ఏఐఆర్‌ఎనడబ్ల్యుఎల్‌సీ పోటీలలో ప్రతిభ చాటిన శివరామకృష్ణ
రజత పతకం సాధించిన ఎ.శివరామకృష్ణయాదవ్‌

కడప (స్పోర్ట్స్‌), ఆగస్టు 29: ముంబయి నగరంలో ఈనెల 26 నుంచి జరిగిన ఆల్‌ ఇండియా రైల్వే నేషనల్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియనషి్‌ప (ఏఐఆర్‌ఎనడబ్ల్యుఎల్‌సీ) పోటీలలో కడప నగరం ఉక్కాయపల్లెకు చెందిన ఎ.శివరామకృష్ణయాదవ్‌ (గుంటూరు రైల్వే ఉద్యోగి-టీసీ) 89 కేజీల విభాగంలో పాల్గొని రజత పతకం సాధించారు. వెస్ట్రన రైల్వే స్పోర్ట్స్‌ అసోసియేషన ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో శివరామకృష్ణ స్నాచలో 140 కేజీలు, అలాగే క్లీన అండ్‌ జెర్క్‌లో 174 కేజీలు మొత్తంగా 314 కేజీల బరువును సునాయాసంగా ఎత్తి సిల్వర్‌ మెడల్‌ సాధించారు. ప్రస్తుతం గుంటూరు రైల్వేలో టీసీగా ఉద్యోగం చేస్తున్న శివరామకృష్ణ సౌత సెంట్రల్‌ రైల్వే సీనియర్‌ కోచ ఖాదర్‌బాష వద్ద శిక్షణ పొందుతున్నారు. కాగా, మున్ముందు సౌత సెంట్రల్‌ రైల్వే తరపున మరిన్ని పోటీలలో పాల్గొని విజేతగా నిలిచి పతకాలు సాధించాలని రైల్వే సిబ్బందితో పాటు పలువురు జిల్లా క్రీడాకారులు ఆకాంక్షిస్తున్నారు.

Updated Date - Aug 30 , 2024 | 12:00 AM