Share News

Balasowry: కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు: బాలశౌరి

ABN , Publish Date - Jun 13 , 2024 | 01:53 PM

కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

Balasowry: కక్ష సాధింపు చర్యలు మా విధానం కాదు:  బాలశౌరి

కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం (Machilipatnam) పార్లమెంట్ సభ్యుడు (Parliament Member) వల్లభనేని బాలశౌరి (Vallabhaneni Balasowry) అన్నారు. జనసైనికులను (Janasena Activists) కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరానని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.


జనసేన పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన తర్వాత తొలిసారి మచిలీపట్నం వచ్చిన వల్లభనేని బాలశౌరి గురువారం స్థానిక ఆర్ అండ్ బీ (R&B) అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నం పార్లమెంట్‌‌ అన్ని విధాలా అభివృద్ధిపర్చడమే తన లక్ష్యమని అన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (Power Finance Corporation) ద్వారా వచ్చే రుణంతో బందరు పోర్టు నిర్మాణాన్ని (Port construction) యేడాదిన్నరలో పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (Bharat Petroleum Corporation) వారితో మాట్లాడి మచిలీపట్నంకు ఆయిల్ రిఫైనరీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని బాలశౌరి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కుటుంబం.. (ఫోటో గ్యాలరీ)

విజయసాయి రెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్..

కబ్జా చేసిన ప్రభుత్వ స్థలాలు పేదలకు పంచుతాం

రుణమాఫీపై రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..

పెన్షన్‌ పెంపు దిశగా చంద్రబాబు చర్యలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 13 , 2024 | 01:58 PM