Share News

Pawan: కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు: పవన్‌

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:35 PM

విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Pawan: కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు: పవన్‌

విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత (Janasena Chief) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. మంగళవారం విజయవాడ (Vijayawada) ఏ కన్వెన్షన్‌ హాలు (A convention hall)లో కూటమి నేతల సమావేశం (Alliance leaders meeting) జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు (Chandrababu) సహా పవన్‌ , పురందేశ్వరి (Purandeswari), కూటమి ఎంపీలు (MPs), ఎమ్మెల్యేలు (MLAs), ఎమ్మెల్సీలు (MLCs) హాజరయ్యారు. సభా నాయకుడిగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఐదు కోట్ల మంది ప్రజలు మనందరిపై నమ్మకం పెట్టుకున్నారని, గత ఐదేళ్లలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయిందని అన్నారు. సంక్షేమానికి ప్రజలు దూరమై ఐదేళ్లు పూర్తి అయిందని, అభివృద్ధిని సమష్టిగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ పిలుపిచ్చారు. ఎన్డీయే కూటమి విజయం స్ఫూర్తినిచ్చిందని, చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి అవసరమని పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నా శపధాన్ని ప్రజలు గౌరవించారు: చంద్రబాబు

నాకు ఏరి కోరి ప్రధాని మోదీ ఆ శాఖ అప్పగించారు..

జేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి

వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..

ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 11 , 2024 | 01:38 PM