Sharmila: సీఎం జగన్, చంద్రబాబుకు లేఖలు రాసిన షర్మిల..

ABN , First Publish Date - 2024-02-07T11:22:31+05:30 IST

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖలు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా, విభజన హామీలు.. ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసిన మోసాలపై చర్చించాలని కోరారు.

Sharmila: సీఎం జగన్, చంద్రబాబుకు లేఖలు రాసిన షర్మిల..

విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లేఖలు రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా, విభజన హామీలు.. ఈ 10 ఏళ్లలో బీజేపీ చేసిన మోసాలపై చర్చించాలని కోరారు. హామీలు అమలు చేసేందుకు ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కుల తీర్మానాన్ని ప్రవేశ పెట్టి ఆమోదించాలన్నారు. ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపాలని షర్మిలారెడ్డి ఆ లేఖల్లో కోరారు.

Updated Date - 2024-02-07T11:22:33+05:30 IST