Share News

Crime: కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

ABN , Publish Date - Jul 14 , 2024 | 08:44 AM

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది.

Crime:  కృష్ణా జిల్లా: మగ శిశువును ఎత్తుకెళ్లిన మహిళ

కృష్ణా జిల్లా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి (Govt. Hospital)లో దారుణం (Atrocious) జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు (Police) ఆ మహిళను పట్టుకుని శిశువును కన్న తల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం కృష్ణాజిల్లా, మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల‌ క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటుంది. రాత్రి 1:30 గంటల సమయంలో గుర్తు తెలియని మహిళ నర్స్ వేషంలో ఆస్పత్రికి వచ్చి మగ శిశువు ఎత్తుకెళ్లింది. వెంటనే గుర్తించిన స్వరూప రాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. మగ శిశువు తీసుకెళ్లిన మహిళను గుర్తించి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసుల సమయస్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసు బలగాలను క్రూరంగా ప్రయోగించారు: యనమల

అరాచక ఐపీఎస్‌లకు షాక్‌!

గీత కార్మికులకు నేడు కాటమయ్య రక్ష కిట్ల పింపిణి..

అదిగో జగన్నాథుడి ఖజానా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 14 , 2024 | 08:45 AM