Share News

YCP: వర్క్‌ అవుట్‌ కాని గులకరాయి… బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..

ABN , Publish Date - Apr 15 , 2024 | 01:54 PM

అమరావతి: సీఎం జగన్‌కు తగిలిన రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు వైసీపీ వేసిన ప్లాన్ పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ, వివేక హత్య కేసును చంద్రబాబుపైకి నెట్టి...

YCP: వర్క్‌ అవుట్‌ కాని గులకరాయి… బెడిసికొట్టిన వైసీపీ ప్లాన్..

అమరావతి: సీఎం జగన్‌ (CM Jagan)కు తగిలిన రాయి దెబ్బ నుంచి రాజకీయ లబ్ది (Political gain) పొందేందుకు వైసీపీ (YCP) వేసిన ప్లాన్ (Plan) పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికల్లో ఓటమి భయంతో సానుభూతి కోసం వేసిన ఎత్తుగడగా ప్రజలకు అర్థమైపోయింది. 2019 ఎన్నికల సమయంలో కోడికత్తి డ్రామ (Kodikatti Drama), వివేక హత్య కేసును (Viveka Murder Case) చంద్రబాబు (Chandrababu)పైకి నెట్టి అధికారం పొందినట్టే ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇలాంటి గులకరాయి డ్రామాకు తెరలేపిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాడి జరిగీ జరగకముందే వైసీపీ కార్యకర్తలు, నేతలు.. చంద్రబాబుకు వ్యతిరేకంగా పట్టుకున్న ఫ్లకార్డులు నిముషాల్లో ఎలా సిద్ధమయ్యాయి? ఏం జరిగిందో తెలియకముందే మంత్రుల నుంచి నాయకుల వరకు జగన్ హత్యకు కుట్ర అంటూ ప్రచారం మొదలుపెట్టడం వెనుక మర్మం ఏంటని నిలదీస్తున్నారు. ఇక ఈ దాడిపై జనం నుంచి సానుభూతి రాకపోగా జనం నుంచి ఎదురుదాడి మొదలవడంతో జగన్ అండ్ కో ఆత్మరక్షణలో పడింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 15 , 2024 | 01:58 PM