Share News

మహానందిలో పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:42 AM

మహా నంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభ వంగా నిర్వహించారు.

మహానందిలో పల్లకీ ఉత్సవం
మహానందిలో పల్లకీ సేవ నిర్వహిస్తున్న వేదపండితులు

మహానంది, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మహా నంది క్షేత్రంలో సోమవారం రాత్రి పల్లకీ ఉత్సవాన్ని ఆలయ వేదపండితులు వైభ వంగా నిర్వహించారు. ఈసందర్భంగా కల్యాణ మంటపంలో వేద పండితుడు రవిశంకర్‌ అవధాని ఆధ్వర్యంలో అర్చకులు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తుల శివనామస్మరణ మధ్య ఆలయ ప్రాంగ ణంలో పల్లకీ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్ధానం నిత్యాన్నదాన సత్రం కూరగాయల దాత లక్కబోయిన ప్రసాద్‌, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:42 AM