Share News

మోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం నెరవేరాలి: మురుగన్‌

ABN , Publish Date - Jul 08 , 2024 | 03:55 AM

ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం నెరవేరాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్ర సమాచార ...

మోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం నెరవేరాలి: మురుగన్‌

తిరుమల, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ సంకల్పం నెరవేరాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని శ్రీవారిని కోరుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ తెలిపారు.

తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం దర్శించుకున్న ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం.. అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూడోసారి మోదీ ప్రభుత్వం రావడం చారిత్రక ఘట్టమని, కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడు నుంచి తనకు అవకాశం కల్పించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 08 , 2024 | 03:55 AM