Share News

AP Election counting 2024: ఆ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్.. ఇంటి బాట పట్టిన కొడాలి, రోజా, వంశీ, అనిల్..

ABN , Publish Date - Jun 04 , 2024 | 10:44 AM

ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్‌ దిశగా దూసుకెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది.

AP Election counting 2024: ఆ జిల్లాల్లో కూటమి క్లీన్‌స్వీప్.. ఇంటి బాట పట్టిన కొడాలి, రోజా, వంశీ, అనిల్..

అమరావతి: ఏపీలో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్‌ దిశగా దూసుకెళుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక కృష్ణా జిల్లాలో అయితే తొలి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.


మూడు రౌండ్లు ముగిసే సరికి ఐదు‌వేలపైన అభ్యర్థులు మెజారిటి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ నుంచి వైసీపీ నేతలు బయటకు వెళ్లిపోయారు. వైసీపీ కీలక నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, కైలే అనిల్‌లు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక మంత్రుల విషయానికి వస్తే అంతా ఓటమి బాటలోనే ఉన్నారు. మంత్రులు రోజా, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఎన్డీఏ కూటమి హవా చాటుతోంది.

Updated Date - Jun 04 , 2024 | 10:44 AM