Share News

Palla Srinivasa Rao Yadav : సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పల్లా

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:36 AM

నాటి సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు.

Palla Srinivasa Rao Yadav : సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం: పల్లా

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నాటి సమర యోధుల ప్రాణ త్యాగాల ఫలితంగానే నేడు భారతీయులు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అనుభవించగలుగుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ అన్నారు. గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు.

‘బిట్రీష్‌ కాలంలో రూ.45 లక్షల కోట్లు దోచుకుంటే.. గత వైసీపీ పాలకులు అంతకంటే ఎక్కువే దోచుకున్నారు. గత వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థల్ని పునర్నిర్మించుకుంటూ.. సుపరిపాలన వైపు సాగడమే కూటమి ప్రభుత్వ కర్తవ్యం’ అని పల్లా అన్నారు. కాగా, మాజీ ఎంపీ లాల్‌జాన్‌ బాషా వర్ధంతి సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు నివాళులర్పించారు.

Updated Date - Aug 16 , 2024 | 03:37 AM