Share News

AP Elections 2024 Counting: కౌంటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు

ABN , Publish Date - Jun 04 , 2024 | 07:50 AM

ప్రకాశం జిల్లా: ఒంగోలు సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్‌తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది.

AP Elections 2024 Counting: కౌంటింగ్‌లో పాల్గొనేందుకు వస్తున్న  సిబ్బంది, ఏజెంట్లు, అభ్యర్థులు

ప్రకాశం జిల్లా: ఒంగోలు (Ongole) సమీపంలోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో (Rise Engineering College) కౌంటింగ్‌కు (Counting) అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒంగోలు పార్లమెంట్‌ (Parliament)తో పాటు ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు, అభ్యర్థులు వస్తున్నారు.


ఒంగోలు పార్లమెంట్ స్థానంలో 25 మంది అభ్యర్థుల పోటీ చేశారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో 140 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్లు లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటల నుంచి ఈవీఎంల ఓట్గు లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్‌లో 2400 మంది కౌంటింగ్ ఏజెంట్లు, 1500 మంది కౌంటింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. మొత్తం 25 కౌంటింగ్ హాల్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో 28 టేబుల్స్ ఉన్నాయి. కౌంటింగ్ హాల్లోకి వెళ్లేందుకు కౌంటింగ్ సిబ్బందికి, అభ్యర్థులకు, కౌంటింగ్ ఏజెంట్లకు వేరువేరుగా మార్గాలు ఏర్పాటు చేశారు.


ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తి ఫలితాలు రావడానికి 6 గంటల నుంచి 9 గంటల సమయం పట్టే అవకాశముంది. ప్రకాశం జిల్లాలో మొదటగా సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఫలితం, చివరిగా కనిగిరి నియోజకవర్గ ఫలితం వచ్చే అవకాశముంది. కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణలు చెలరేకుండా 1000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఘర్షణలు చెలరేగకుండా నిన్న (సోమవారం), ఈరోజు (మంగళవారం), రేపు (బుధవారం) 144 సెక్షన్ విధించారు. జిల్లాలో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్న 156 గ్రామాల్లో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 87. 24 శాతం ఓటింగ్ నమోదైంది. దర్శి లో 91శాతం ఓటింగ్ నమోదు కాగా.. జిల్లాలో భారీగా పోలింగ్ శాతం నమోదు కావడంతో అభ్యర్థుల గెలుపుపై ఉత్కంఠత నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Hyderabad: తీర్పుకు వేళాయె..

Pinnelli : ఇదేమి తీర్పు?

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 04 , 2024 | 07:50 AM