Share News

TDP: విశాఖ ఎంపీ అక్రమాలపై ఆధారాలు ఉన్నాయి: వెలగపూడి రామకృష్ణ బాబు

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:58 AM

విశాఖ: తూర్పు నియోజక వర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఆహ్వానించడానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు.

TDP: విశాఖ ఎంపీ  అక్రమాలపై  ఆధారాలు ఉన్నాయి: వెలగపూడి రామకృష్ణ బాబు

విశాఖ: తూర్పు నియోజక వర్గంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమానికి ఆహ్వానించడానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చానని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ... తాను, ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉన్నామని, గతంలో వేర్వేరు పార్టీల నుంచి తాము పోటీ చేసినా ఇద్దరమూ వ్యక్తిగతంగా తిట్టుకోలేదన్నారు. విశాఖ ఎంపీ సత్యనారాయణ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్నారు. విశాఖ ఎంపీ అక్రమాలపై ఎంపీ విజయ సాయి రెడ్డి ఆరోపణలు కూడా చేశారన్నారు. టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఎంపీ సత్యనారాయణ అక్రమాలపై విచారణ జరిపిస్తామని వెలగపూడి రామకృష్ణ బాబు స్పష్టం చేశారు.

Updated Date - Feb 15 , 2024 | 11:58 AM