Share News

Crime: ఎంపీడీవో అదృశ్యం కేసులో ట్విస్ట్..

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:38 PM

ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీడీవో ఎం. వెంకటరమణా రావు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు.

Crime: ఎంపీడీవో  అదృశ్యం కేసులో ట్విస్ట్..

ప.గో.జిల్లా: నరసాపురం ఎంపీడీవో (MPDO) ఎం. వెంకటరమణా రావు (M.Venkataramanarao) అదృశ్యం (Disappear) కేసులో ట్విస్ట్ నెలకొంది. ఎంపీడీవో అదృశ్యంపై ఫెర్రీ బకాయిదారు రెడ్డప్ప ధవేజీ (Reddappa Dhaveji) స్పందించారు. ప్రభుత్వానికి తాను రూ. 50 లక్షలు బాకీ ఉన్న మాట నిజమేనని, దానికి సంబంధించి గ్యారంటీ నిమిత్తం ప్రభుత్వానికి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. బాకీ ఉన్న మొత్తం కన్నా డాక్యుమెంట్లు విలువే ఎక్కువని చెప్పారు. ఆ ప్రకారం చూస్తే తనకే ప్రభుత్వం నుంచి డబ్బులు వస్తాయన్నారు. ఈ వ్యవహారంతో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు (Ex MLA Prasadarao)కు ఎటువంటి సంబంధం లేదని, తనను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని రెడ్డప్ప ధవేజీ వ్యాఖ్యానించారు.


కాగా నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి, వైసీపీకి చెందిన ప్రభుత్వ మాజీ విప్‌ ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టరు ధవేజీ చేస్తున్న బెదింపులను తట్టుకోలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరిట లేఖ రాసి ఎంపీడీవో అదృశ్యమయ్యారు. తన తండ్రి కనిపించకుండా పోయాడంటూ వెంకటరమణారావు చిన్న కుమారుడు మహీధర్‌ ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటరమణారావు సుమారు ఐదు నెలల నుంచి నరసాపురంలో ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 10 నుంచి సెలవు పెట్టి పెనమలూరు దరి కానూరు మహదేవపురం కాలనీలోని ఇంటివద్దనే ఉంటున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో మచిలీపట్నం వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లారు. అదే రోజు మధ్యాహ్నం మూడున్నరకు ఇంటికి ఫోన్‌చేసి తాను బందరులోనే ఉన్నానని, ఇంటికి రావడంలేదని చెప్పారు. తర్వాత అర్ధరాత్రి ఆయన ఫోన్‌ నుంచి.. ఈ రోజు నా పుట్టిన రోజు, చనిపోయేరోజు కూడా, ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండమని కుటుంబసభ్యులకు మెసేజ్‌ వచ్చింది. కంగారుపడిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆయన బండి కూడా బందరు రైల్వే స్టేషన్లోనే ఉన్నట్లు గుర్తించారు.


వాట్సా్‌పలో పవన్‌ పేరిట సూసైడ్‌ నోట్‌

వెంకటరమణారావు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పేరిట రాసిన సూసైడ్‌ నోట్‌ తన సెల్‌ఫోన్‌ నుంచి కుటుంబ సభ్యులకు పంపించారు. ఆ నోట్‌లో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుపై ఆరోపణలు చేశారు. గత మూడున్నరేళ్లుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకు రూ.55 లక్షలు చెల్లించవలసి ఉందని, ప్రసాదరాజు అండదండలతో ఆ కాంట్రాక్టరు సొమ్ము చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని, ప్రసాదరాజు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని, దీన్నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదని పేర్కొన్నారు. 33 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదని వాపోయారు. కాగా ఎంపీడీవో వెంకట రమణా రావు అదృశ్యం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అదృశ్యమయి ఐదు రోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు.


ఎంపీడీవో కుటుంబసభ్యులకు సీఎం ఫోన్..

నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణారావు కుటుంబసభ్యులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మాట్లాడారు. 5 రోజుల నుంచి ఆచూకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్ చేసి దైర్యం చెప్పారు. రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్లేటప్పుడు ఏం చెప్పారు..? ఆయన ఒత్తిడికి గురవ్వడానికి గల కారణాలు ఏంటి..? అని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలు విషయాలను సీఎంకు.. ఆయన కుటుంబ సభ్యులు నిశితంగా వివరించారు. కొద్ది రోజులుగా వెంకటరమణారావు తీవ్ర ఒత్తిడితో ఉన్నారని ఎంపీడీఓ సతీమణి సునీత తెలిపారు. ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారన్నారు. ఆమెతో పాటు, కుమారుడు సాయిరాంతో ఫోన్‌లో చంద్రబాబు మాట్లాడారు.


బాధ్యులపై చర్యలు తీసుకుంటాం: సీఎం చంద్రబాబు

గతంలో ఎప్పుడైనా ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని సీఎం అడిగారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. నిజాయితీ పరుడు, సమర్థుడైన అధికారి ఆచూకీ లేకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారంవ్యక్తం చేశారు. వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబం వద్ద ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తో కూడా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కలెక్టర్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.


ముత్యాలంపాడు వద్ద ఆగిన ఫోన్ సిగ్నల్స్

ఈ నెల 15న రాత్రి మచిలీపట్నం రైల్వేస్టేషన్ వద్ద ద్విచక్రవాహనాన్ని ఎంపీడీవో వెంకటరమణా రావు పెట్టారు. ఆ తర్వాత టికెట్ తీసుకుని రైలు ఎక్కేశారు. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌ను పోలీసులు సంపాదించారు. ఇక ఆయన విజయవాడలో రైలు దిగారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ మాత్రం ముత్యాలంపాడు వద్ద ఆగిపోయాయి. ఈ ముత్యాలంపాడుకు సమీపంలోనే ఏలూరు కాలువ ఉండడంతో దానిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16వ తేదీ వెంకటరమణారావు పుట్టినరోజు కావడంతో అదే రోజున ‘ఈ రోజు నా పుట్టిన రోజు. నేను చనిపోయే రోజు కూడా’ అదే అంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్ పెట్టారు.


మాజీ విప్ ప్రసాదరాజు కారణమా..?

తనను తాను మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని.. కాబట్టి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా కుటుంబసభ్యులకు ఎంపీడీవో వాట్సాప్‍‌లో నోట్ పంపారు. బోటింగ్ కాంట్రాక్టర్‍‌ను రూ.55లక్షలు ఫెర్రీ లీజు బకాయిలు చెల్లించాలని అడిగితే బెదిరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. గత చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతోనే వారు డబ్బులు చెల్లించలేదని, గత మూడున్నర నెలల నుంచి నిందితులు తీవ్రంగా ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ తప్పూ చేయకపోయినా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. బకాయిలు రికవరీ చేయకపోవడం వల్ల తనను బాధ్యుడిని చేసే అవకాశం ఉందని, తనకు ఉద్యోగమే జీవనాధారం అంటూ బాధను వెల్లగక్కారు. నిందితులు బకాయి డబ్బు చెల్లించేలా చూసి న్యాయం చేయాలంటూ ఆయన లేఖలో కోరారు.


కొనసాగుతున్న మిస్టరీ..

నరసాపురం ఎంపీడీవో వెంకట రమణా రావు అదృశ్యం కేసులో మిస్టరీ కొనసాగుతోంది. అదృశ్యమయ్యి నాలుగురోజులు అవుతున్నా ఆచూకీ దొరకడం లేదు. విజయవాడ మధురానగర్ వద్ద కాల్వలోకి దూకి ఉంటాడనే అనుమానంతో గాలింపు కొనసాగుతోంది. వెంకట రమణారావుకు తరచుగా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నెల 15న రాత్రి 10 గంటలకు వెంకట రమణారావు అదృశ్యమయ్యారు


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మార్కు రాజకీయం..

నీట్‌పై సుప్రీం కీలక ఆదేశాలు..

ఇంద్రకీలాద్రిలో శాకంబరీ ఉత్సవాలు...

మోదీకి లేఖ రాసిన జగన్..

రైతులను నిండా ముంచిన జగన్ సర్కార్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 12:38 PM