Share News

Kuppam: కుప్పంలో ఆగని వైసీపీ అరాచకాలు.. చంపేస్తామంటూ టీడీపీ నేతకు బెదిరింపులు

ABN , Publish Date - Jun 20 , 2024 | 11:59 AM

కుప్పంలో వైసీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయినా టీడీపీ నేతలపై వైసీపీ నేతల బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఎలాగైనా ఒక్క టీడీపీ నేతనైనా చంపేస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kuppam: కుప్పంలో ఆగని వైసీపీ అరాచకాలు.. చంపేస్తామంటూ టీడీపీ నేతకు బెదిరింపులు

చిత్తూరు: కుప్పంలో వైసీపీ అరాచకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయినా టీడీపీ నేతలపై వైసీపీ నేతల బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఎలాగైనా ఒక్క టీడీపీ నేతనైనా చంపేస్తామని బెదిరిస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అధికారంలో లేకున్నా ఈ స్థాయిలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడటం ఆసక్తికరంగా మారింది. కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన టీడీపీ యువత అధ్యక్షడు బాలును చంపేస్తానని వైసీపీకి చెందిన మహేష్ బెదరించాడు.


మహేష్ బెదిరింపులకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరినో ఒకరిని చంపితే కానీ మా కసి తీరదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంకా అధికారంలో ఉన్నట్టే వైసీపీ అల్లరిమూకలు ప్రవర్తిస్తున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు తెలిపాడు. సీఎం సొంత గడ్డపైనే వైసీపీ నేతలు ఇంత పెద్ద ఎత్తున అరాచకానికి పాల్పడితే మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Updated Date - Jun 20 , 2024 | 11:59 AM